స్వామి అయ్యప్ప దేవాలయంలో ఇరుముడి కార్యక్రమం
Published: Monday December 13, 2021
మధిర డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో లడక బజారులో వెలసి ఉన్న స్వామి అయ్యప్ప దేవాలయంలో మండల పూజ కార్యక్రమంలో భాగంగా 41ఒక రోజుల దీక్షలు ముగించుకొని ఇరుముడులు దాల్చి శబరిమల యాత్రకు లడక్ బజార్ అయ్యప్ప భక్త బృందం చెరుపల్లి శ్రీధర్ గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరినారు. శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో పండుగ వాతావరణం లో వేడుక గా జరిగిన ఈ ఇరుముడి కార్యక్రమం ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామి కృపకు తిలకించి స్వామి స్వామి కృపకు పాత్రులయ్యారు శ్రీధర్ తెలిపారు స్వామి అయ్యప్ప దేవాలయంలో మండల పూజా కార్యక్రమంలో భాగంగా బత్తుల శ్రీనివాసరావు గురుస్వామి, మేకల ఉపెంద్ర గురుస్వామి పాల్గొని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మాల దారులకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పూజా కార్యక్రమంలో అన్నదానం చేయడం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం చేయడం వల్ల స్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చలవాది శ్రీనివాస్ దేవస్థానం సభ్యులు పాల్గొన్నారు
Share this on your social network: