మధిర పట్టణ బీజేపీ సంస్థగత నిర్మాణం పై సమావేశం
Published: Thursday February 24, 2022
మధిర ఫిబ్రవరి 23 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు బిజెపి బూత్ స్థాయి బిజెపి పార్టీ నిర్మాణం కొరకు చర్చించుటకు ఈ సమావేశానికి జిల్లా సంఘటన ప్రముఖ్, ఆర్గనైజేషన్ కార్యదర్శి, కొండా హరీష్ జి, ముఖ్య అతిధిగా వచ్చి బీజేపీ పార్టీ నిర్మాణం పై చర్చించటం జరిగింది, పార్టీ ని బూత్ స్థాయి నుండి నిర్మాణం చేసుకుంటూ బీజేపీ పార్టీని ఈ ప్రాంతములో బలమైన శక్తిగా నిల్పటం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమములో బీజేపీ పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, చిలువేరు సాంబాశివారావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, బీజేపీ సీనియర్ నాయకులు Dvn సోమేశ్వరావు, కొనా నరసింహారావు, పట్టణ ప్రధాన కార్యదర్శులు పగడాల నాగేంద్రబాబు, ఉపాధ్యక్షులు మాదిరాజ్ సాయిరాం, ఓబీసీ మోర్చా ఖాజామియా, మైనార్టీ మోర్చా, md గౌస్, చాట్ల సందీప్, శివరాజ్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: