తూప్రాన్ పేట గ్రామంలో పూజాకార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్

Published: Monday December 05, 2022
చౌటుప్పల్ డిసెంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)
చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట గ్రామంలో శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీశ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభం ప్రతిష్ట మరియు కళ్యాణోత్సవంలో కార్యక్రమానికి హుజురాబాద్ శాసన సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామదేవతల ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి,జడ్పీటీసీ చిలుకురి ప్రభాకర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ చక్రం జంగయ్య,మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి,మండల బీజేపీ అధ్యక్షులు రిక్కల సుధాకర్ రెడ్డి,గ్రామాశాఖ అధ్యక్షులు గంధం ఆంజనేయులు,మంటిపెల్లి పెద్ద చెన్నయ్య,కాసం యాదయ్య యాదవ్,మంటిపెల్లి చిన్న మల్లయ్య యాదవ్,నర్సింహ,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.