ఉచిత ఎరువులు లేవు పంట రుణమాపీ లేదు

Published: Wednesday February 17, 2021
ఎండబెట్ల వరుణ్ కుమార్
సారంగాపూర్, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన): సారంగాపూర్ మండల కేంద్రంలోని బిజెపి నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ అధిష్టానం ఆదేశానుసారం తెలంగాణ రైతులకు రైతురుణ మాఫీని వెంటనే విడుదల చేయాలని మరియు ఉచిత ఎరువుల పంపిణీని వెంటనే చేపట్టాలని సారంగాపూర్ బిజెపి మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మాయమాటలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చి రుణమాఫీ గురించి ఇంతవరకు ఊసే ఎత్తకుండ ఉచిత ఎరువుల పంపిణీ చేస్తానని హామీఇచ్చి ఒక బస్తా కూడ ఇవ్వకుండ పచ్చి మోసం చేసిన కేసీఆర్ను నమ్మవద్దని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగం గమనించాలని హితువు పలికారు. అనంతరం తహశీల్దార్ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ రాగిల్ల సత్యనారాయణ బద్దెల గంగరాజం శాంతయ్య గంగారెడ్డి దీటి వెంకటేష్ ఏశాల రాజు అజ్మీరా యాదయ్య ప్రమోద్ ఆనంతుల స్వామి మోదిగం మల్లేష్ నరేష్ తిరుపతి మల్లేష్ కలాగిరి మధు రెడ్డి తోట సంతోష్ నరేష్ గౌడ్ సంతోష్ పడిగెల రవి తదితరులు పాల్గొన్నారు.