కోరుట్ల మండల యం.పి.డి.ఓ గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

Published: Friday May 28, 2021
కోరుట్ల, మే 27 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం ప్రజా పరిషత్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ను జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏం.పీ.ఓ నీరజ, కల్లూరు గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, రాజారెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు దుంపల రాజ నర్సయ్య, నూతిపెల్లి ముత్తయ్య, దానవేని మల్లయ్య, రాజరెడ్డి, గడికొప్పుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.