కోరుట్ల మండల యం.పి.డి.ఓ గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
Published: Friday May 28, 2021
కోరుట్ల, మే 27 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం ప్రజా పరిషత్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ను జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏం.పీ.ఓ నీరజ, కల్లూరు గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, రాజారెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు దుంపల రాజ నర్సయ్య, నూతిపెల్లి ముత్తయ్య, దానవేని మల్లయ్య, రాజరెడ్డి, గడికొప్పుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: