2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి : కేక్ కట్ చేసిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Thursday September 16, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు కోట్ల మంది ప్రజలకు కోవిడ్ వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత కలెక్టర్ రవి గూగులోత్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ జడ్పీ సీఈఓ సంధ్యారాణి జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ జిల్లా పంచాయతీ అధికారి పల్లికొండ నరేష్ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూపరాణి మరియు ఇతర ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.