మన ఆరోగ్యం బాగుండాలి అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Published: Saturday April 24, 2021
- కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : చందానగర్ డివిజన్ లోని ఓల్డ్ బాంబే రోడ్డు నుంచి అమిన్ పుర్ వరకు రోడ్డు ఇరువైపుల పారిశుధ్య పనులను జిహెచ్ఎంసీ  అధికారులతో కలిసి స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి శుక్రవారం నాడు చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రహదారి ఇరువైపుల పరిశుభ్రంగా ఉంచాలని పారిశుధ్య కార్మికులకు ఆదేశించారు. కరోనా రోజురోజుకు విజృంభింస్తున్న వేళ ప్రజలు ఇంటి చుట్టూ పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోని తడి పోడి చేత్తను వేరువేరుగా జిహెచ్ఎంసీ అటో వారికి అందించాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. చేత్తను ఏక్కడంటే అక్కడ పాడేస్తే వారిపై చర్యలు తిసుకుంటామని హెచ్చరించారు. షాపు యజమానులు రోడ్ల పై చేత్తను పాడేయకుండా చెత్త కుండిలను ఏర్పాటు చేసుకోవాలని వాటిని చెత్త ఆటో వారికి అందించాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది పని చేస్తున్నారని ప్రజలు వారికి సహకరించాలన్నారు.