కరోనా నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు
Published: Tuesday May 25, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి : కరోనా నియంత్రణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగా విస్తృతమైన దాడులు నిర్వహించి మధిర పరిధిలో 12 కేసులు నమోదు చేసి 11 మంది వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 101 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు పేర్కొన్నారు. అదేవిధంగా నాలుగువందల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగిందన్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న నిర్వాహకులను ఏడుగురిని బైండోవర్ కేసు నిమిత్తం ఎర్రుపాలెం తాసిల్దార్ వద్ద అప్పగించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా బెల్ట్ షాప్ నిర్వాహకులు పై ప్రత్యేకమైన గా నిఘా ఉంచి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు తెలిపారు
Share this on your social network: