కన్యకా పరమేశ్వరి ఆలయంలో రజితపరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు
Published: Monday October 11, 2021
మేడిపల్లి, అక్టోబర్10 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో స్థానిక కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ఆదివారం నిర్వహించిన అమ్మవారి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రజిత పరమేశ్వర్రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిక్కుమళ్ల రమేష్, సుధాకర్, పొందుటురి లక్ష్మణ్, పాలడుగు లక్ష్మణ్, కవిత, ప్రమీల, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: