16 నుండి 18 వరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు

Published: Thursday September 15, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 14 సెప్టెంబర్ ప్రజా పాలన : ఈనెల 16 నుండి 18 వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా తేదీ 17 న పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పతకావిష్కరణ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవాల మాదిరిగానే పోలీస్ పరడ్ గ్రౌండ్స్ లో ఈనెల 17 న ఉదయం 9:00 గంటలకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప సభాపతి పద్మారావు పాల్గొననున్నట్లు తెలియజేసినారు.  సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని సూచించారు.  గ్రౌండ్ లో వర్షపు నీరు నిలువకుండ చదును చేయాలన్నారు. ఈ సమావేశంలో డి ఆర్ ఓ అశోక్ కుమార్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్, డిటిడిఓ కోటాజీ, ఆర్డిఓ విజయకుమారి, డిఇఓ రేణుకదేవి, డివైయస్ఓ హన్మంత్ రావు, ఇఇ/  ఆర్ అండ్ బి లాల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.