ఆడపడుచులకు బతుకమ్మ చీరాల పంపిణీ
Published: Sunday October 10, 2021
కోరుట్ల, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలములోని జోగన్ పల్లి గ్రామంలో శనివారము రోజున ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలు గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనీ ఆడపడుచుల ఆనందం కోసం వారి అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళలకు అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ ప్రాంతంలోని మహిళల పండగ అయిన బతుకమ్మ పండుగకు కేసీఆర్ కానుకగా తెలంగాణా లోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందిస్తున్నారన్నారు. ఆడపడుచులందరూ సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుంపల నర్సు రాజా నర్సయ్య, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, వార్డ్ సభ్యులు బద్దం రాజేశం, పల్లికొండ రమేష్ ముత్యపు రాజా శేఖర్, దులూరి నర్సింలు, తేలు రంజిత్, తదిదరులు పాల్గోన్నారు.
Share this on your social network: