రైల్వే అండర్ బ్రిడ్జి కాలువకు మరమ్మత్తు
Published: Wednesday February 17, 2021
మధిర, ఫిబ్రవరి 15, ప్రజాపాలన: మధిర మున్సిపాలిటీ పరిధిలో రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర ఉన్న డ్రైనేజీ పొంగి ప్రయాణికుల రాక పోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న విషయం కొందరు సోషల్ మీడియా ద్వారా కొందరు తెలియ చేయడం జరిగింది.ఈ ప్రజా పాలనప్రెస్ ద్వారా తెలుసుకున్న మధిర మున్సిపాలిటీ చైర్-పర్సన్ మొండితోక లత మునిసిపల్ కమీషనర్ రమాదేవి వెంటనే స్పందించి ఈరోజు జేసీబీ తో డ్రైనేజీని పక్కనే తీయించి సమస్యకు పరిష్కారం చూపించడం జరిగింది. ఈ సందర్బంగా చైర్-పర్సన్ మాట్లాడుతూ ఇలాంటి సమస్యలు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ వున్నా సంబంధిత కౌన్సిలర్ కి గానీ, కమీషనర్ దృష్టికి గానీ లేదా మాకు తెలియ చేసినా వెంటనే పరిష్కరించే దానికి మేము మా పాలకవర్గం ఎప్పుడూ ముందు ఉంటామని తెలియచేసారు.
Share this on your social network: