మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.....

Published: Thursday January 27, 2022
ఎర్రుపాలెం జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవం  సందర్భంగా  మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తూ  రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలిస్తున్న నేతల వల్ల నేడు రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ ఎంతో దూర దృష్టితో ఆనాడే ఈ విషయాన్ని హెచ్చరించారని, మంచి వ్యక్తులను ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని ఆయన సూచించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బండారు నరసింహ రావు, ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి, సొసైటీ ఉపాధ్యక్షులు కడియం శ్రీనివాసరావు, మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, ఎస్సి సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, గాంధీ పదం అధ్యక్షులు రావూరు నాగబాబు, మండల నాయకులు లింగాల నాగేశ్వరావు, శ్రీనివాస రావు, నాగిరెడ్డి, నండ్రు జనార్ధన్, షేక్ ఇస్మాయిల్, కంచర్ల వెంకట నరసయ్య తదిరులు పాల్గొన్నారు.