టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం

Published: Thursday September 30, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ 17. 18. 19. వార్డులలో ముఖ్య కార్యకర్తల సమావేశం మున్నూరు కాపు బస్తి బంగారు మైసమ్మ దేవాలయ ఆవరణలో సమావేశం నిర్వహించడమైనది. అట్టి సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు అల్వాల్ వెంకట్ రెడ్డి కార్యదర్శి మడుపు వేణుగోపాల్ రావు వారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందడం మన అందరి కర్తవ్యం అని సంక్షేమ పథకాల ఆధారంగా తీసుకొని రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లి విధంగా వారు అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉండి మరింత ముందుకు పార్టీని రక్షించుకునేందుకు పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కప్పరి స్రవంతి చందు. వైస్ చైర్మెన్ ఆకుల యాదగిరి. మున్సిపల్ కౌన్సిలర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల చిన్న, ఆకుల సురేష్, ఇందిరాల రమేష్, తాళ్ల మహేష్ గౌడ్, మోహిజ్ పాష, బర్ల జగదీష్, కె వి రమేష్, మరియు వార్డు అధ్యక్షులు ఒకటో వార్డు ముత్యాల భానుచందర్, 15వ వార్డు అధ్యక్షులు బస్వాపురం కృష్ణ, 18వ వార్డు అధ్యక్షులు బొప్పాపురం పరమేష్, నవీన్ 19వ వార్డు అధ్యక్షులు ముత్యాల నవీన్, కంచె కుంట్ల భాస్కర్, గాజుల భూపాల్, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యవర్గ సభ్యులు గుంత బాబురావు, ఎం కిరణ్ అప్ప, ముజాకిర్ టిఆర్ఎస్వి అధ్యక్షులు మడుపు శివ సాయి, యూత్ అధ్యక్షులు ముత్యాల వినోద్ సిహెచ్ రాజేందర్, వనమాల రవీందర్, మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.