కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టండి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Wednesday February 09, 2022
బెల్లంపల్లి ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మణిహారం లాంటి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసి సింగరేణి కార్మికుల, ఉద్యోగుల పొట్టకొట్టడానికి సిద్ధమైందని, ఈ కార్మిక వ్యతిరేక చర్యలను కార్మికులంతా ఉద్యమించి కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి సింగరేణిని ప్రైవేటీకరణను కాకుండా కాపాడుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం నాడు బెల్లంపల్లి ఏరియా అబ్బాపూర్ ఉపరితల గని వద్ద ఏర్పాటు చేసిన గేట్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతు సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మేము ఉద్యమంలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులమైన మేము కూడా భాగస్వామ్యం అవుతామని, అలాగే రేపు జరిగే నిరాహార దీక్షకు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అందరూ హాజరై విజయవంతం చేసి మన ఐక్యతను ఢిల్లీ వరకు చాటిచెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మాళ్రాజు శ్రీనివాసరావు, తెరాస, టీబీజీకేఎస్ నాయకులు ధరావత్ మంగిలాల్, మెరుగు రమేష్, అన్నం లక్ష్మయ్య, రాజేశం, గురుజల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.