రైతు బందుతో రైతులకు మేలు : ఎమ్మెల్యే రేఖానాయక్

Published: Monday January 10, 2022
జన్నారం రూరల్, జనవరి 9, ప్రజాపాలన: రైతులకు వ్యవసాయ పెట్టుబడి సహయం క్రింద సర్కారు అందిస్తున్న రైతు బందుతో వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు, ఆదివారం పోన్కల్ రైతు వేదిక భవనంలో నిర్వహించిన రైతు బందు సంబారాలు పాల్గొని ప్రసంగించారు, రైతు బందు పథకం దేశానికే అదర్శంగా నిలుస్తుందన్నారు, రైతులకు వ్యవసాయ పెట్టుబడిలో ఇబ్బందులు లేకుండా వుండేందుకే సిఎం కేసిఆర్ రైతు బందు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారని అన్నారు, అనంతరం రైతు వేదిక ముందు నిర్వహించిన కోలాటంలో పాల్గొని కోలాటం అడారు, ఈ కార్యక్రమంలో ఎంపిపి మదాడి సరోజన, ఈవో సంగీత, టిఆర్ఎస్ మండల ప్రజిడెంట్ రాజారాం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చన్న, వైస్ చైర్మన్ భరత్, పోన్కల్ సహకార సంఘం చైర్మన్ శీలం రమేష్, పోన్కల్ సర్పంచ్ భూమేష్, కో-ఆప్షన్ సభ్యుడు మున్వార్ అలీఖాన్, మండలంలోని, సర్పంచులు, ఎంపిటీసిలు, ఐకేపి సిబ్బంది పాల్గొన్నారు.