గణేష్ మండపం వద్ద అన్నదానం

Published: Thursday September 16, 2021

వలిగొండ సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని ఆరూర్ గ్రామంలో యువ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోడితాల కరుణాకర్ శ్రావణి లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కొడతాల జోగయ్య జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఒక్కొక్కరుగా గణనాధుని ఫలహారం స్వామి వారి భోజన ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో భక్తులు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వాకిటి పద్మ అనంత రెడ్డి, ఆవుల స్వామి, బండారు నరసింహా రెడ్డి, మైపాల్ రెడ్డి, జింకల దానయ్య, పోలేపాక చంద్రయ్య, చెమ్మయ్య, యువ స్టార్ యూత్ సభ్యులు కసిరబోయిన మచ్చగిరి, మహేష్, రమేష్, వెంకటేష్, శకి మత్స్యగిరి, రెబ్బస్ నవీన్, శ్రీకాంత్, గొడ్డేటి మల్లేష్, నరాల మహేష్ తదితరులు పాల్గొన్నారు