క్రీడామైదానం కు స్థలం ఏర్పాటు చేయాలి

Published: Wednesday October 13, 2021
పట్టణ యువకులు జాయింట్ కలెక్టర్ కు వినతి
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 12 (ప్రజాపాలన) : జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం కొరకు స్థలం ఏర్పాటు చేయాలని పట్టణ యువకులు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేశంకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఏవైనా ఆటలు ఆడుకోవాలి అనుకుంటే జిల్లా కేంద్రంలో సరైన క్రీడా మైదానం, లేకపోవడంతో రన్నింగ్ చేసుకోవడానికి కానీ, వాకింగ్ చేసుకోవడానికి కానీ, మైదానం లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జిల్లా కేంద్రంలో కేటాయించిన మినీ స్టేడియంను సాయుధ దళంకి కేటాయించారని, అప్పటి నుండి ఇప్పటి వరకూ చాలాసార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్రీడామైదానం కొరకు స్థలం కేటాయించాలని, స్థలం కేటాయించక పోతే జిల్లాలోని యువకుల ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడిస్తామని అన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో అమీర్, అఫీజ్, పోల్కర్ సాయిరాం, అఫ్రోజ్, భీమ్ రావు, శ్రవణ్, బాలు, శివ, సమీర్, తదితరులు పాల్గొన్నారు.