నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Monday March 14, 2022
నస్పూర్, మార్చి 13, ప్రజాపాలన ప్రతినిధి: నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా భూపతి రవి, ప్రధాన కార్యదర్శిగా శ్రీపతి రాములు, ఉపాధ్యక్షుడిగా క్యాతం రాజేష్, కోశాధికారిగా కేశిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని అధ్యక్షుడు భూపతి రవి తెలిపారు. విలేకరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.