ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి *నేడు పోలీసు అభ్యర్థులకు శిక్షణ శిబిరం ప్

Published: Friday November 18, 2022

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  నియోజకవర్గ ప్రాంత యువత కోసం ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల సాధన మహాయజ్ఞం లో భాగంగా పోలీసు ఉద్యోగాల ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల రెండవదశ ఉచిత శిక్షణాశిబిరం శుక్రవారం ప్రారంభిస్తున్నామని, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్డుపైగల  గురుకుల విద్యాపీఠ్ పాఠశాల గ్రౌండ్స్ లో  శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ శారీరక శిక్షణా శిభిరాన్ని (ఫిజికల్ ట్రైనింగ్ క్యాంపు) ప్రారంభిస్తారు. అర్హులైన అభ్యర్థులందరూ తగు సమయానికి హాజరుకాగలరని తెలిపారు. సుశిక్షితులైన ఫిజికల్ డైరెక్టర్లు , వసతులు , సౌకర్యాలపై ఫౌండేషన్ సభ్యులతో ఎమ్మెల్యే  సమీక్షించారు. ఈవెంట్స్ లో ఉత్తీర్ణత సాధించే అభ్యర్థులకు మూడవదశలో మెయిన్స్ పరీక్షకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు ఫౌండేషన్ కార్యదర్శి జెర్కోని రాజును  సెల్ నెంబర్ (9948555125 )కు  సంప్రదించగలరని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు.