గుడ్ న్యూస్ పాఠశాలకు 40 వేలు వితరణ ..

Published: Thursday December 15, 2022

వైరా(ఏన్కూర్), డిసెంబర్ 14 (ప్రజా పాలన న్యూస్): ఏన్కూర్ మండలంలోని  తూతకలింగన్నపేట గుడ్ న్యూస్  మిషనరీ ఉన్నత పాఠశాలలో సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు కుమారుడు, పూర్వ విద్యార్థి శెట్టిపల్లి నరేష్ కళావేదిక మరమ్మతులకు బుధవారం రూ. 40 వేలు వితరణగా అందించారు.  నరేష్ కుమారుడు రిషిక్ ,కుమార్తె శాన్విక ల పేరుతో  కళావేదిక ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సిస్టర్ బ్రిటో దాతలకు కృతజ్ఞతలు తెలిపారు