పీర్జాదిగూడ కార్పొరేషన్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Published: Monday August 16, 2021
మేడిపల్లి, ఆగస్టు15 (ప్రజాపాలన ప్రతినిధి) : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మేయర్ జక్క వెంకట్ రెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు మరియు పట్టణ పెద్దలతో కలిసి కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్లలో పర్యటించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితమే  దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. కార్పొరేషన్ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పట్టణ పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.