డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సై, పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Published: Monday November 21, 2022
బోనకల్, నవంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని ఎస్సై ,కానిస్టేబుల్ అభ్యర్థులకు డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ బోనకల్ షైన్ పాఠశాలలో ప్రతి ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆదివారం ఉచిత శిక్షణ ప్రారంభానికి డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరావు అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉద్యోగాలు సంపాదించాలంటే కష్టపడి చదివి ఈ సమాజ మార్పు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈ యొక్క కార్యక్రమాన్ని మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయులు, వికాస సబ్జెక్ట్ నిపుణులు పిల్లలమర్రి శివ నరసింహారావు బోధించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శివ నరసింహారావు మాట్లాడుతూ ఉద్యోగాలు రావాలంటే మీ లక్ష్యం కోసం ఇష్టపడి చదవాలని, కష్టపడి ఉద్యోగం సంపాదించాలని అభ్యర్థులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గూగుల్ నరేష్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు బానోతు గోపి, డివైఎఫ్ఐ మండల నాయకులు ధరావత్ జగన్, బానోతు గోపి, షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.