అవెన్యూ మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలి

Published: Friday January 14, 2022
మేకవనంపల్లి సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 జనవరి ప్రజాపాలన : రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలని మేక వనం పల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ల శశిధర్ రెడ్డి గ్రామ సిబ్బందికి సూచించారు గురువారం మోమిన్పేట్ మండల పరిధిలోని మేక వనం పల్లి గ్రామంలో అవెన్యూ మొక్కలకు నీరు పట్టే దృశ్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్క పసిపాపల్లా పెంచి పోషించాలని హితవు పలికారు. ప్రతి మొక్కకు సాసర్ పిట్ ఏర్పాటుచేసి నీళ్లు పట్టాలని పేర్కొన్నారు. గొర్రెలు మేకలు తినకుండా సంరక్షణ పద్ధతులు పాటించాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి, గ్రామ కారోబార్ కుమ్మరి శ్రీనివాస్, డ్రైవర్ శేఖర్ ముదిరాజ్, గ్రామ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.