పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాస్ రెడ్డి అధికారులు

Published: Tuesday June 07, 2022
మేడిపల్లి జూన్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)  
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ డివిజన్లోని శ్రీరామ కాలనీలో 
మున్సిపల్  అధికారులతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీరామ కాలనీలో పేరుకుపోయిన చెత్తాచెదారంను స్వయంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తొలగించారు. కచ్చేరి స్కూల్లో పరిసరాల పరిశుభ్రత, ఇంకుడు గుంత చుట్టూ శుభ్రం చేయడం, శ్రీరామ కాలనీలో వంగిపోయిన విద్యుత్ స్తంభాలను ఆధునీకరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.   అదేవిధంగా హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి, ఈఈ నాగేందర్, డీఈ.నిఖిల్ రెడ్డి, ఎఈ. వసంత, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ ,ఎస్ డబ్ల్యూ డి ఈ చందన, విద్యుత్ అధికారులు మున్సిపల్ సిబ్బంది. టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.