నరసింహారావుకు నివాళులర్పించిన పిడమర్తి రవి..

Published: Saturday September 24, 2022
 తల్లాడ, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని నూతనకల్లు మాజీ సర్పంచ్ గణేశుల నరసింహారావు ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి శుక్రవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తపరిచారు. తొలుత నరసింహారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. స్థానిక టిఆర్ఎస్ నేత గణేశుల రవిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు అనేక సేవలందించిన నరసింహారావు మృతి పార్టీకి తీరని లోటన్నారు.*