రోడ్డెక్కిన రైతన్నలు వంటావార్పుతో నిరసనలు...

Published: Thursday December 02, 2021

బీరుపూర్, డిసెంబర్ 01 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కమ్మునూర్ గ్రామంలో రైతులు పండించిన ధాన్యాన్ని  కోనకపోవడంతో రైతన్నలు రోడ్లపై టెంట్లు వేసుకోని వంటావార్పుతో రోడ్డెక్కి నిరసనలు తేలపడంతో వచ్చిపోయే వాహనాలు ఎక్కేడికక్కడ నిలిచిపోయాయి. కోనుగోలు కేంద్రాలలో నెల రోజులుగా పోసిన వడ్లు నీలసి పోవడంతో వర్షాలకు తడిసి మ్యాచర్ రాకపోవడంతో వడ్లను తూకం చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొని రోడ్డెకమని రైతులు వాపోయారు. ఈ కార్యక్రమంలో తాటి తిరుపతి తోట సంతోష్ నవ్వ రాయమల్లు పుదారి మల్లయ్య తాటి రవీందర్ బందెల రత్నయ్య సంకెండ్ల లక్ష్మీరాజ్యం తాటి మల్లేష్ కుంబల రజలింగు తదితరులు రైతులు పాల్గొన్నారు.