నేడు తల్లాడకు నిరంజన్ రెడ్డి తల్లాడకు రాక..
Published: Monday January 10, 2022
టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రెడ్డం వీరమోహన్ రెడ్డి..
తల్లాడ, జనవరి 9 (ప్రజా పాలన న్యూస్): తల్లాడలో నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తల్లాడకు రానున్నారని తల్లాడ సొసైటీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డం వీరమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పిలుపు మేరకు మంత్రులు మండలంలో పర్యటిస్తారని వెల్లడించారు. వారితో పాటు ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల్ హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కోవిడ్ నిబంధనలు అనుసరించి హాజరుకావాలని కోరారు.
Share this on your social network: