శివాలయం వద్ద వరద ఉధృతిని పరిశీలిస్తున్న టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్
Published: Friday July 23, 2021
మధిర, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర శివాలయం వద్ద వైరా నది లోని ప్రతి గంట గంటకి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా ప్రజలు ఎవరు అటుగా వెళ్లొద్దని టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ తెలియజేశారు. ఇంకా మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతున్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఏదైనా ప్రమాదాలు ఉన్నచో పోలీస్ వారికి తెలియ చేయాలని వారు తెలియజేశారు. టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ గారి నెంబర్ 790 1131302, 9440904259 తెలియజేయగలరు.
Share this on your social network: