తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇంటింటికి ప్రచారం

Published: Monday April 10, 2023

బీరుపూర్, ఏప్రిల్ 09 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి మహంకాళి రాజన్న మాట్లాడుతూ 2004 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగంల్లో విద్య వైద్య గూడు నీడ తదితర సంక్షేమ పథకాలను అమలు పరచి అన్ని రంగాల్లో మరియు ఒక లక్ష 70 వేల ప్రభుత్వ ఉపాద్యాయ నియామకాలు చేపట్టి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి అందించేవారని గుర్తు చేశారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం టీఎస్ పిఎస్ పేపర్ లీకేజీ అంశాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలుగు  హిందీ పేపర్ లికేజీలు చేసి విద్యార్థుల జీవితాలతో అటాడుకుంటున్న ప్రభుత్వలను ప్రజలు వెంటనే గద్దె దించాలని రాజన్న ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ చంద్రబాబు అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే అని గురుకుల ఆశ్రమ పాఠశాలు వెల్ఫేర్ హాస్టల్స్ ఇంజనీరింగ్ కాలేజీలు అంగన్వాడి భవనములు సిమెంట్ రోడ్లు ప్రతి కిలోమీటర్లు ప్రాథమిక పాఠశాల జూనియర్ కాలేజ్ ప్రతి డివిజన్ కు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టే అని రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు పక్కా ఇల్లు ఉచిత విద్యుత్ తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో జరిగాయని  పేర్కొన్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు సుర్వి సంతోష్ రావు కటిక రెడ్డి ప్రభాకర్ సంద్రపు విజయ్ కుమార్ బత్తుల కొండయ్య నక్క లక్ష్మణ్ పాల్గొన్నారు.