మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్

Published: Saturday May 28, 2022

జగిత్యాల, మే 27 ( ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి, సంగం పెల్లి మరియు గుట్రాజ్ పల్లి  గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు మన బడి కార్యక్రమాన్ని  దాదాపు 60 లక్షల వ్యయంతో  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్ పాక్స్ చైర్మన్ సందీప్ రావు, మండలపార్టీ అధ్యక్షులు బాల ముకుందం, సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్, అంకతి మల్లవ్వ,  విజయలక్ష్మి, జైపాల్ రెడ్డి, మహేశ్వర్ రావు, రాజేశ్వర్ రెడ్డి దామోదర్, ఎంపీటీసీ లు మమత పరుశురాం గౌడ్ డిఈ మిలింద్, మండల విద్యా అధికారి గాయత్రి ఎస్ఎమ్ సి ఛైర్మెన్ లు ఉపాధ్యాయులు  పూర్వ విద్యార్ధులు, నాయకులూ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.