ఆధారుతో ఓటర్ ఐడి అనుసంధానం కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్

Published: Saturday September 03, 2022
శ్రీవాణి వెంకట్రావు
మేడిపల్లి, సెప్టెంబర్2 (ప్రజాపాలన ప్రతినిధి)
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆధారుతో ఓటర్ ఐడి అనుసంధానం కార్యక్రమంలో భాగంగా రామంతాపూర్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావు బిఎల్ ఓ  ఆఫీసర్లతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్  తన ఓటర్ ఐడిని ఆధారుతో 265 బూతులో అనుసంధానం చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆధారుతో ఓటర్ ఐడి అనుసంధానం ప్రతి ఒక్కరూ చేసుకోవాలని, ఆధార్ తో ఓటరు అనుసంధానం చేసినట్లయితే దొంగ ఓట్లకు తావుండదని తెలిపారు. ప్రతి ఇంటికి జిహెచ్ఎంసి బిఎల్ఓ ఆఫీసర్లు  వచ్చి అనుసంధానం చేస్తారని, కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిఎల్ ఓ ఆఫీసర్స్ మరియు బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area