బాలల దినోత్సవం సందర్భంగా నోటు పుస్తకాలను అందజేసిన బీపి నాయక్

Published: Tuesday November 16, 2021
బోనకల్, నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని బాలల దినోత్సవం సందర్భంగా గార్లపాడు గ్రామంలో గార్లపాడు యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోనూసూద్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి పార్టీ యువ నాయకులు ఎన్ఆర్ఐ బీపీ నాయక్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరియు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. బాల బాలికలకు రైటింగ్ పాయింట్స్ మరియు నోటు బుక్స్ పుస్తకాలను అందజేశారు. సోను సూద్ విగ్రహాన్ని నెలకొల్పినందుకు గుర్రం వెంకరేశ్వరావ్‌ ని అభినందించి సత్కరించారు. అతనికి ప్రతి అడుగులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కరోనా విపత్కర సమయంలో సోనూసూద్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు కిషన్ నాయక్, స్వెరో కమిటీ కన్వీనర్ రమేష్ నాయక్, గార్లపాడు యువతరం ఫౌండేషన్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.