తల్లాడలో కలశములు ఊరేగింపు..

Published: Monday September 12, 2022
తల్లాడ, సెప్టెంబర్ 11 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడలో వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కలశములను ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలశములను ఎత్తుకొని పట్టణ పురవీధుల్లో తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి  ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు నంబూరి మోహన్ రావు, కేతేపల్లి భాస్కరరావు, జవ్వాజి నగేష్, లగడపాటి నెహ్రూ, నంబూరి కనకదుర్గ ప్రసాద్, బొజ్జ నరసింహారావు, వేమిశెట్టి రాంబాబు, వేమిషెట్టి శంకర్, నంబూరి శ్రీనివాసరావు, అనుమోలు సర్వేశ్వరరావు, పసుమర్తి హరీష్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.