*సీనియర్ పాత్రికేయులు రాజేష్ కుటుంబాని పరామర్శించిన ఎమ్మెల్యే*
Published: Monday October 17, 2022
చేవెళ్ల, అక్టోబర్ 16 (ప్రజాపాలన):
చేవెళ్ల గ్రామానికి చెందిన సీనియర్ రిపోర్టర్ రాజేష్ తల్లి ప్రమాదవశాత్తు చేవెళ్ల గుండంలో పడి మరణించింది విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య రాజేష్ ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం రాజేష్,కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య వెంట టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాల్గరి రమణారెడ్డి,చేవెళ్ల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, జిల్లా సివిల్ సప్లయర్ డైరెక్టర్ రవీందర్,చేవెళ్ల పాత్రికేయులు,తదితరులు ఉన్నారు
Share this on your social network: