సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు
Published: Monday February 22, 2021
తె.రా.స మండల శాఖ అధ్యక్షులు కోమటిరెడ్డి సింధుజా రెడ్డి.
వెల్గటూర్, ఫిబ్రవరి 21 (ప్రజాపాలన): వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామానికి చెందిన సింధుజ రెడ్డి వెల్గటూర్ మండల తె.రా.స మహిళ అధ్యక్షురాలు కోమటిరెడ్డి సింధుజ రెడ్డిని జగిత్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నియమించి నందునంకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆదివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింధుజ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఈశ్వర్ నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు వారి రుణం తీర్చుకుంటానని ఆమె అన్నారు. సహకరించిన మండల శాఖ నాయకులకు, మహిళా కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమములో మండల ఎం.పి.పి కునామల్ల లక్ష్మి లింగయ్య, జెడ్పిటిసి సభ్యురాలు బి. సుధారాణి రామస్వామి, పార్టీ ప్రధాన కార్యదర్శి సింహాచలం జగన్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రియాజ్ పాల్గొన్నారు.
Share this on your social network: