టీఆరెస్ పార్టీ 20వ, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Wednesday April 28, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ​గొల్లపల్లి మండల కేంద్రంలో తెరాస పార్టీ 20వ, ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ తెరాస గొల్లపల్లి మండలశాఖ అధ్యక్షుడు బొల్లం రమేష్  ఆధ్వర్యంలో తెరాసపార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొల్లం రమేష్  మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఏజెండాగా, తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడానికి కేసీఆర్ గారు 20 వసంతాల కింద తెలంగాణ రాష్ట్ర సమితి ని స్థాపించారు అని అన్నారు. 2009 లో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తెరాస కేసీఆర్ గారు విజయవంతం అయ్యారన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీటీసీ గోస్కుల జలంధర్, ఏఎంసి చైర్మన్ ముస్కు లింగారెడ్డి, వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ముస్కు కిష్టారెడ్డి, తెరాసయూత్ అధ్యక్షులు చెవుల రవీందర్ అవారి చందు, గొల్లపల్లి ఉప సర్పంచ్ మారం రాజశేఖర్, టీఆరెస్ ప్రధాన కార్యదర్శి మారంపల్లి బాబు, పట్టణ అధ్యక్షుడు చౌటపల్లి తిరుపతి నాయకులు కచ్చు కొమురయ్య, కనుకుట్ల లింగారెడ్డి, నర్సాపురం రవీందర్, నారాయణ రెడ్డి, రాంచందర్ రెడ్డి, కూనా రాజేందర్, చాడ సత్తయ్య, రత్నం తదితరులు పాల్గొన్నారు.