సోనియాగాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మ దహనం

Published: Saturday July 30, 2022

కోరుట్ల, జూలై 29 (ప్రజాపాలన ప్రతినిధి):

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయఅధ్యక్షులు సోనియా గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం కోరుట్ల నియోజకవర్గం కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు పడుతున్న అవస్థలు పట్టించుకోకుండా తన కూతురుపై వచ్చిన అభియోగాల దృష్ట్యా పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోనియాగాంధీ పట్ల అవమానపరిచే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.ఇప్పటికైనా సోనియా గాంధీ కి బహిరంగ క్షమాపణ చెప్పి, ప్రజా సంస్థలపై దృష్టి సారించి పెంచిన ధరలను తగ్గించాలని సామాన్య ప్రజలు ఉపయోగించే వస్తువులు, పదార్థాలపై వేసిన జిఎస్టిని తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అద్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమండ్ల సత్య నారాయణ, కోరుట్ల పట్టణ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు రిజ్వన్ పాషా, పట్టణ కాంగ్రెస్ సెక్రెటరీ మ్యకల నర్సయ్య, జాయింట్ సెక్రెటరీ ఎంబేరి సత్య నారాయణ, మల్లాపూర్ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోతు శేఖర్, నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మ్యాదరి, యూత్ కాంగ్రెస్ మండలం ఉపాధ్యక్షులు సైదు గంగాధర్, మల్లాపూర్ మండలం యూత్ ప్రధాన కార్యదర్శి బాలసాని ప్రణయ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ముహమ్మద్ అన్వర్,తహసీన్, బారి,అసద్, నసీర్,షోయబ్,జిబ్రాన్, ఫయాజ్, ఇబ్రహిం కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్ లు పాల్గొన్నారు.