ప్రశ్నిస్తే అరెస్ట్ లు సిగ్గుమాలిన చర్య ...బిజెపి నాయకుడు కోడి రమేష్

Published: Wednesday August 24, 2022
బెల్లంపల్లి, ఆగస్టు 23, ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను బిజెపి పార్టీ ప్రశ్నిస్తే పోలీసులచే అక్రమ అరెస్టులను చేయించడం ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుమాలిన చర్య అని  బెల్లంపల్లి పట్టణ బిజెపి అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు.
 
రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్న బిజెపి నాయకులను  మంగళవారం నాడు వారి ఇండ్ల వద్దనే అరెస్టు చేశారని ఇలాంటి అరెస్టులు చేయడం సిగ్గుమాలిన చర్య అని, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసనలు తెలపడం వారి హక్కానీ, ఆ హక్కులను హరించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో
పట్టణ అధ్యక్షులు కోడి రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు,  ఎరుకల శ్రీనివాస్, మహిళా మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు గోమాస కమల,  కోడి సురేష్ ,  కల్లేపల్లి నవీన్, ఎరుకల నర్సింగ్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి, స్రవంతి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు పీక లక్ష్మణ్ తదితరులు  పాల్గొన్నారు.