వామపక్షాలు బలపరిచిన జయసారధి రెడ్డినే గెలిపించండి : సీపీఐ(ఎం), సీపీఐ, ఏఐఎస్ఎఫ్

Published: Saturday March 13, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, మార్చి 12, ప్రజాపాలన: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వామపక్షాలు బలపరిచిన జయసారధి రెడ్డినే గెలిపించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జోగ నర్సయ్య, సీపీఐ మండల కార్యదర్శి వాగబొయిన రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే షాహిద్ అన్నారు.శుక్రవారం జయసారథి రెడ్డి గెలుపును కాంక్షిస్తూ గుండాల, రోళ్ళగడ్డ, దామరతోగు, లింగగూడెం తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జయసారధి రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, జయసారధి రెడ్డి గెలుపుతోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో సాయనపల్లి సర్పంచ్ బచ్చల లక్ష్మినర్సు, క్రిష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు.