టిఆర్ఎస్ లోని వర్గ పోరుతో విసుగు చెందే కాంగ్రెస్లో చేరాం

Published: Monday October 10, 2022

మధిర అక్టోబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) మండలంలోని  వంగవీడు గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరుతో విసుగు చెంది ఆ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారని, గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన నాయకులు ప్రకటించారు. ఆదివారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ తాము గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరుతో విసుకు చెంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అన్నారు మమ్మల్ని కాంగ్రెస్ నాయకులు దళిత బంధు ఇప్పిస్తామని  కాంగ్రెస్ కండువాలు కప్పినట్లు టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మాట్లాడుతూ తాము ఎవరిని ప్రలోభ పెట్టి కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేయలేదన్నారు. సీఎల్పీ లీడర్ స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వంగవీడు గ్రామంలో పలు కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరటం జరిగిందన్నారు. టిఆర్ఎస్ నాయకులు వాస్తవాలను గుర్తించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ధారా బాలరాజు కాంగ్రెస్ నాయకులు ఐలూరి సత్యనారాయణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అద్దంకి రవికుమార్ మాజీ సర్పంచులు కర్నాటి రామారావు, దుంపా వెంకటేశ్వర రెడ్డి, బొమ్మ కంటి హరిబాబు, ఆదిమూలం శ్రీనివాసరావు చక్రి తదితరులు పాల్గొన్నారు.