శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Published: Monday April 26, 2021
పటాన్ చేరు, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పటాన్చెరు బస్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు. ఆయన ఆదివారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్య సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు భక్తి భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు రూపొందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: