వీరంరాజుకు నివాళులర్పించిన అడిషనల్ కలెక్టర్ సతీమణి..

Published: Wednesday August 24, 2022
తల్లాడ, ఆగస్టు 23 (ప్రజాపాలన న్యూస్):
 
 తల్లాడ పట్టణానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు సరికొండ వీరంరాజు ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ సతీమణి సాయి వెంకటలక్ష్మి మంగళవారం తల్లాడలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సరికొండ అప్పలరాజు పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. వీరారాజు సతీమణి సరికొండ రమణమ్మ, మాజీ ఎంపీపీ సరికొండ లక్ష్మీ పద్మావతి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.