పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులు ప్రధానం చేసిన కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి

Published: Monday May 02, 2022
మేడిపల్లి, మే 1 (ప్రజాపాలన ప్రతినిధి) : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ, నగరపాలక సంస్థ తరఫున కార్మికులకు అవార్డులు, సన్మాన కార్యక్రమం, సహపంక్తి భోజనం కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ రామకృష్ణారావు, 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి. ఈ సందర్భంగా 11వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ తో కలిసి కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అనంతరెడ్డి, సుభాష్ నాయక్, బండారి మంజుల రవీందర్, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, దేవేందర్ గౌడ్, మహేష్, రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.