*కంటి వెలుగు శిబిరానికి వచ్చిన వారికీ మర్యాద ఆప్యాయతలతో సేవలందించాలి*
-రంగారెడ్డి జిల్లా వైద్య అధికారి, వెంకటేశ్వరరావు.
చేవెళ్ల జనవరి 23, (ప్రజాపాలన):-
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బి వెంకటేశ్వరరావు చేవెళ్ల డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలలో మొయినాబాద్ కంటి వెలుగు శిబిరము మరియు చిలుకూరు సందర్శించి,నిర్వహణ ఎలా జరుగుచున్నదో తెలుసుకొని సిబ్బందికి తగు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు.
క్యాంపుకు వచ్చిన వారిపట్ల మర్యాద ఆప్యాయతతో వారికి సేవలు అందించాలని అన్నారు. అలాగే మొయినాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చేవెళ్లలోని పాలిటివ్ కేర్ సెంటర్ ను చందనవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అక్కడ క్యాన్సర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా నిర్మితమవుతున్న నూతన భవనాన్ని హైదరాబాద్ ఉపకేంద్ర భవనపు నిర్మాణ పనులను పరిశీలించారు. చెందినవెల్లి గ్రామంలోని కంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించి క్యాంప్ ని విజయవంతం చేయాలని అందరికీ మరొకసారి సూచనలు ఇచ్చారు.డి ఎం హెచ్ ఓ గారితో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టీ దామోదర్ సిహెచ్ గోపాల్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: