బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు** -దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, -పేదల
చేవెళ్ల ,సెప్టెంబర్ 27(ప్రజా పాలన)
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తుందని,చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల మండ పరిధిలోని దామరగిద్ద, రామన్నగూడ, సింగప్పగూడ, ఆలూరు గ్రామాల్లో మంగళవారం నూతన పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెం.1 అని తెలంగాణలో సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులకు రూ.2 వేల 16, వికలాంగులకు రూ.3 వేల 16 అందిస్తున్న ఏకైక రాష్ట్రంగ తెలంగాణ చరిత్ర సృష్టిస్తున్నదని, మన ప్రధాని మోడీ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో పింఛన్ల లేవని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఏం కావాలో తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ఎనకటికి రొట్టె మీద కారం పెట్టినోడిని చచ్చే వరక గుర్తు పెట్టుకునేదని, మన సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి ఏదో విధంగా ప్రభుత్వ ఫలాలు
Share this on your social network: