ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి,
Published: Wednesday December 14, 2022
*మరణించిన రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ,పాలకమండలి*
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ప్రాథమిక శేరిగూడ గ్రామ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఉప్పరి గూడ గ్రామానికి చెందిన జక్కుల పెద్ద మల్లేష్ ఇటీవలే మరణించిన సందర్భంలో వ్యవసాయ సహకార సంఘం నుండి జక్కుల సుగుణమ్మకు బ్యాంకు ద్వారా 15 వేల రూపాయలు పాలకమండలి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ శంకరయ్య, పాలక మండలి సభ్యులు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నలోల్ల పోచమ్మ, సీఈఓ బోసు పెళ్లి గణేష్, గ్రామ పెద్ద లు పాలకమండల్ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: