పల్లెల్లో పర్యటించిన బట్టి

Published: Wednesday June 02, 2021
ఖమ్మం, జూన్ 1, (ప్రజాపాలన.ప్రతినిధి) : ఎర్రుపాలెం మండలం లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క పర్యటించారు. కరోన వైరస్ ఉధృతి పెరిగినందున బాధితులు ఎదుర్కొనే ఇబ్బందులు. ఆసుపత్రులు అందిస్తున్న వైద్య సేవల తీరును స్వయంగా తెలుసుకొనేందుకు బట్టి పర్యటించారు. మండలంలోని పెద్దగోపవరం, వెంకటాపురం, భీమవరం, గుంటుపల్లి గోపవరం లో పర్యటించి కరోనా బాధితులను పరామర్శించారు, పెద్దగోపవరం శీలం రుక్మాంగధర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. కరోనకు భయపడాల్సిన పనిలేదని దైర్యంగా ఉండాలన్నారు. గుంటుపల్లి గోపవరంలో రైతులు విద్యుత్ కనెక్షన్లు, పొలాల్లో మట్టి తొలుకొనుట ఇతర పలు సమస్యలు బట్టి దృష్టికి తీసుకెళ్లారు. సంబందిత అధికారులతో మాట్లాడి సమస్యలను  పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బట్టి పర్యటనలో మండల కాంగ్రస్ కమిటీ అధ్యక్ష, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, శీలం శ్రీనివాసరెడ్డి, నాయకులు తల్లపురెడ్డి నాగిరెడ్డి, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, ఏ వి కృష్ణారావు,శీలం నర్సిరెడ్డి, దేవరకొండ శ్రీను, సామినేని హనుమంతరావు, భుసిపల్లి వెంకటరెడ్డి, కోట కృష్ణయ్య, రాజీవ్ గాంధీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.