ఆదివాసీ సేన మండల కమిటీ ఎన్నిక
Published: Monday September 12, 2022
జన్నారం, సెప్టెంబర్ 11, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివాసీ సేన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అదివారం ఎన్నికలను ఆదివాసీ సేన మండల బాధ్యులు దుర్వ యశ్వంత్ రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదివాసీ సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎన్నికల ఇంచార్జీ రాయిసిడం జంగుపటేల్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు, ఈ నూతన ఆదివాసీ సేన మండల అధ్యక్షుడు దుర్వ యశ్వంత్ రావు, మండలఉపాధ్యక్షులుగా
కుంర అరుణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి తుంరం లక్ష్మణ్,
సంయుక్త కార్యదర్శి
ఆడ రామకృష్ణ, కోశాధికారి
తుంరం భోజ్జు, ప్రచార కార్యదర్శి ఆత్రం సంతోష్, సభ్యులు సోనేరావు పటేల్, మందడి జంగు పటేల్, అడ మానిక్ రావు, జుగ్నాక్ మోతిరాం లను ఎన్నుకున్నారు. ఈ కార్యాక్రమంలో ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి, ఆదివాసీ రైతు సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ తోడషం భూమ పటేల్, ఆదివాసీ సేన ఉమ్మడి అదిలాబాద్ కార్యదర్శి కాత్లె బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: