నాలుగో రోజు కు చేరిన అఖిలపక్షం పార్టీ ల రిలే నిరాహారదీక్ష

Published: Friday July 02, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి ఒకటో తేదీ మున్సిపాలిటీమధిర ప్రభుత్వ  ఆసుపత్రిలో వైద్యుల పోస్ట్లు భర్తీ చేయాలని కోరుతూ అఖిలపక్షం పార్టీ ల ఆధ్వర్యంలో నాలుగో రోజు కు చేరిన రిలే నిరాహార దీక్ష, ఈ  దీక్షలో కూర్చున్న వారు కాంగ్రెస్ పార్టీ నుంచి వనమాపిచ్చయ్య, కనకపూడి కరుణాకర్, టీడీపి పార్టీ నుంచి మన్నే పల్లిరత్నకుమారి,కొర్లగంటి మాధవరావు, సీపీఐ పార్టీ నుంచి షేక్ రహీం, కొంగర నరేందర్. ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన వారు సీపీఎం నాయకులు రామనర్సయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు,మున్సిపల్ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు,సీపీఐ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బెజవాడ రవి బాబు, సీపీఐ మండల సెక్రటరీ ఉట్ల కొండల్ రావు, బీజేపీ పార్టీ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచెం కృష్ణారావు, దీక్ష ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ. ప్రభుత్వ హాస్పటల్ లో వెంటనే డాక్టర్లు ను నియమించాలి అని,ప్రభుత్వం మధిర మీద సవతి ప్రేమ చూపిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం మధిర ఆసుపత్రిలో డాక్టర్స్ ని నియమించాలి అని అన్నారు లేని పక్షంలో పోరాటం ఉదృతం చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, ముస్లిం వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు మొహమ్మద్ అలీ,ఆదిములం శ్రీనివాస్, సూర్యదేవర కోటేశ్వరరావు, సంపాసల రామకృష్ణ, సీపీఐనాయకులు, మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు